వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవోను రాబోయే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో రద్దు చేస్తామని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు.శుక్రవారం బార్ అసోసియేషన్ సభ్యులను కొండబాబు మర్యాదపూర్వకంగా కలిసి ఓటు వేయాలని కోరారు. ప్రజల ఆస్తులకు విభుతం కలిగించే ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవోను రద్దుకు సహకరించవలసిందిగా బార్ అసోసియేషన్ సభ్యులను విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించవలసింది పోయి, ఆస్తులను దోచుకోవడానికి వైసిపి ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తీసుకు వచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు కొటికలపూడి శ్రీనివాస్, జవహర్ అలీ, కాకర వెంకటేశ్వరరావు, బొగ్గవరపు గోకుల కృష్ణ, దండుప్రోలు నాగబాబు, చెక్క శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.