fbpx

పవన్ కళ్యాణ్ మాదిరిగా నియోజకవర్గాలు మారలేదు : చలమల శెట్టి సునీల్

Share the content

ఎన్నికల నామినేషన్ చివరి రోజున భారీ జనసందోహంతో కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం కాకినాడ ఆనంద భారతి వద్దకు చేరుకొని అక్కడినుంచి భారీ ర్యాలీతో మెయిన్ రోడ్, బాలాజీ చెరువు సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా పరిషత్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంనకు చేరుకొని తమ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున జన సమీకరణంతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి తిరిగి వచ్చి విలేకరులతో మాట్లాడారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని సమస్యలపై తనకు దృష్టి ఉందని పేర్కొన్నారు. నాలుగు పర్యాయాలు కాకినాడ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనను విమర్శించిన జనసేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. పవన్ మాదిరిగా తాను నియోజకవర్గంలను మార్చుకోలేదని… నాలుగు పర్యాయాలగా కాకినాడ ఎంపీ స్థానం తరుపున పోటీ చేస్తున్నానని వివరించారు.. అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. సునీల్ వెంట కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి వంగా గీత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైకాపా నేతలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *