fbpx

టీడీపీ గెలుపుతోనే పెన్షనర్స్ కు న్యాయం : రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్

Share the content

రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ప్రభుత్వ పెన్సనర్స్ లకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పెన్సనర్స్ అసోసియేషన్ నేతలు పి గురవయ్య, జి పూర్ణచంద్రరావు, జి విజ్డం చౌదరిలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి పెన్సనర్స్ లు అందరు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…. వైసిపి ప్రభుత్వం పింఛన్లును సకాలంలో అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.వైసిపి మళ్ళీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.జగన్ తీరుతోనే రాష్ట్రం తిరోగమంలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబర్ టవర్స్, ఐటి రంగాన్ని నిర్మించి చంద్రబాబు యువతకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు.రాష్ట్ర భవిష్యత్ కోసమే తాము చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *