కాకినాడ పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్డీయే అభ్యర్థులే గెలుస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. ఆదివారం ఏసుదాసు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వచ్చారు.శ్రీనివాస్ కు ఏసుదాసు వాసిరెడ్డి దంపతులు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి స్వాగతం పలికారు. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తిలను కూడా మర్యాదపూర్వకంగా సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ….. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికలు మాదిరిగా ప్రజల ఇళ్ల వద్దకెళ్లి ఓట్లను అభ్యర్థించాలని సూచించారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాపు సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కూడా దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. వైసీపీకి బుద్ధి చెప్పి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం కాపు సద్భావన సంఘం నాయకులను వాసిరెడ్డి ఏసుదాసు ఒక్కొక్కరిగా పరిచయం చేశారు.