తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక, కార్యదర్శిలుగా కాకినాడ నగరానికి చెందిన గుణ్ణం చంద్రమౌళి, మాజీ జడ్పీటీసీ టిడిపి సీనియర్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, నియమితులయ్యారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు బుధవారం నాడు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న చంద్రమౌళి, రాజశేఖర్ ఇరువురు గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షంలో టిడిపి తరపున అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి చేపట్టిన ‘బాదుడే బాదుడు’, ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి..’ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ కార్యక్రమాలను కాకినాడ జిల్లాలో విజయవంతం చేయడంలో గుణ్ణం, పేరాబత్తుల, కీలక పాత్ర పోషించారు. అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ లకు అత్యంత సన్నిహితులైన విరిద్దరు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిలుగ బాధ్యతలు అప్పగించడం పట్ల టిడిపి వర్గాల్లోనే కాక జిల్లాలో అన్ని వర్గాల నుండి హర్షం వ్యక్తమవుతోంది.