fbpx

తెలుగుదేశంతోనే రజకుల సంక్షేమం సాధ్యం

Share the content

రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా బీసీ సెల్ రజక సాధికార కమిటీ కన్వినర్ ఏవిడి మెంటారావు ఆధ్యాతన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం రజక భరోసా బాట సమావేశం నిర్వహించారు.ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీ రజక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గుర్రపసాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శెట్టిపల్లిజి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్తిబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, చప్పిడి వెంకటేశ్వరరావు, తాతపూడి రామకృష్ణ, పెరిక కన్వీనర్ వనపర్తి బద్రి, తదితరులు ప్రసంగించారు. రజకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా దువ్వారపు రామారావు మాట్లాడుతూ…. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ కులాలకు ఆదరణ పథకం ద్వారా కులవృత్తులు చేసుకునే వర్గాల వారికి సామాగ్రి పనిముట్లు, రజకులకు వాషింగ్ మిషన్, ఐరన్ బాక్సులు, సబ్సిడీపై అందించి వారిని ఆదుకోవడంతో పాటు సబ్సిడీ ద్వారా రుణాలు అందించామని గుర్తు చేశారు. బీసీ విద్యార్థిని ,విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ లను నిర్మించి, విదేశీ విద్యను అభ్యసించుటకు విదేశీ విద్య కానుకను అందించి వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించాం. నేడు జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలతో పాటు రజకులు కూడా మోసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవ్వుతూ దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారని వాపోయారు.

మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ…. బలహీన వర్గాలకు రాజకీయాలలో అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత నందమూరి తారక రామారావు దక్కుతుంది అని పేర్కొన్నారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలను రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాలలోనూ ఎదిగే విధంగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. నేడు వైసిపి పాలనలో బిసి లపై దాడులు, దౌర్జన్యాలు, విపరీతంగా పెరిగాయని, రజకుల సంక్షేమానికి రజకుల భవిష్యత్తు ప్రణాళికకు తెలుగుదేశం పార్టీ పునాదిని, తెలిపారు.

తెలుగుదేశం పార్టీ రజక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గుర్రపసాల రామకృష్ణ మాట్లాడుతూ…. రజక కమ్యూనిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ అని, గత తెలుగుదేశo ప్రభుత్వం బీసీ వర్గాలకు అత్యున్నత పదవులు కల్పించి గౌరవించుకోవడం జరిగిందని, నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేషన్ పేరితో పదవుల కలిపించి వారికి కుర్చీలు కార్యాలయాలు కూడా లేకుండా చేసి బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల్ల బాబురావు, గొలితు సత్యనారాయణ, నరం శ్రీనివాసరావు, అనకాపల్లి గణేష్ రావు, ర్యాలీ రాంబాబు, సీల అప్పలరాజు, చోడవరపు సత్యనారాయణ, వేల్పూరి వెంకటేష్, వాకలపూడి రాజు, సైనవరపు పెద్దబాబు, గంజివరపు సుబ్బారావు, కలిదిండి తాతారావు, పెద్దపూడి చంటిబాబు, కోడూరి సూరిబాబు, వేములపూడి వెంకటరమణ, కలిదిండి సురేష్, మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, కొల్లాబత్తుల అప్పారావు, ఒమ్మి బాలాజీ, పొంగా బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *