fbpx

రెండు నెలల్లో వైసిపి దుష్ట పాలన విముక్తి : నాగబాబు

Share the content

ప్రతి యుగంలో దేవుళ్ళు కంటే రాక్షసులకు కాస్త ఎక్కువ బలం ఉంది. రాక్షసులును వధించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో కొంత మంది వ్యక్తులు పుడతారు.త్రేతా యుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగములో శ్రీ కృష్ణుడు పుట్టినట్లు కలి యుగంలో వైసిపి దుష్ట పాలనను అంత మొందించడానికి పవన్ కళ్యాణ్ వచ్చారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు.ఆదివారం ఉమ్మడి విశాఖ జిల్లా మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం అనకాపల్లి లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..అవినీతి తో కుళ్లిపోయిన వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి జనసేన కార్యకర్త సిద్ధంగా ఉండాలని అన్నారు.రెండు నెలలు కలిసి కట్టుగా పని చేస్తే వైసిపి దుష్ట పాలనను విముక్తి పొందవచ్చు అని తెలిపారు. ప్రజా ధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కు తండ్రులు,తాతలు పేర్లు పెట్టుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వైసీపీలో చాలా మంది భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.భూమికి మనం చెందుతాము కానీ మనకు భూమి చెందదు అని హెచ్చరించారు. రాబోయే జన సేన టిడిపి ప్రభుత్వంలో భూములు దోచుకున్న రాభందులను న్యాయ స్థానాల్లో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడాలి.
పవన్ కళ్యాణ్ కు పదవులు మీద ఆశ లేదు.ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలనే ఆకాంక్ష బలంగా ఉన్న వ్యక్తికి అండగా నిలబడాలి అని పిలుపునిచ్చారు.2019 ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా పట్టు వదలకుండా భవన నిర్మాణ కార్మికులు,మత్స్యకారులు, రాజధాని రైతులు సమస్యలపై పోరాడారు అని గుర్తు చేశారు.దుష్ట వైసిపిని ఇంటికి పంపించే వరకు కలిసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరకి భవిష్యత్తు లో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *