తెలంగాణ ఎన్నికల రోజున నాగార్జునసాగర్ వద్ద రాష్ర్ట పోలీసులు మోహరించి నాటకం ఆడినట్లు… ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రినివాసరావు విమర్శించారు.రాష్ట్ర రాజధాని విషయంలో వైసిపి పిల్లి మొగ్గల్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆయన తెలిపారు. వైసిపి అధికార ప్రతినిధి వై.వి. సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని హైదరబాద్ అంశం ను ప్రతిపాదించడం దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతపాడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి తమ వైఫల్యాన్ని కప్పిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్చల్ని వెంటనే ఆపేయాలని కోరారు. అమరావతి రాజధానిగా దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని …ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రం సమ్మతం కాదన్నారు.. హైదరాబాదును వదిలేసి పది ఏండ్లు అయింది. ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటూ కొత్త చర్చను లేవదీసి మొత్తం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. అమరావతి రాజధానిగా అంగీకరించి అభివృద్ధి చేయకపోతే వైసిపిని ప్రజలు క్షమించరని హెచ్చరించారు.