fbpx

వైసిపిని చిత్తు చిత్తుగా ఓడించటానికి ప్రజలు సిద్ధం : అచ్చెన్నాయుడు

Share the content

రానున్న ఎన్నికల్లో వైసిపి కి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని…ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించటనికి రాష్ట్ర ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు కు వెళ్ళే ముందుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు.రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఉబిలోకి నెట్టేసారని మండిపడ్డారు. ప్రతి కుటుంబం మీద ఎనిమిదిన్నర లక్షల అప్పులు భారం మోపారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య్యాన్ని పూర్తిగా నిషేధం చేసినా తరువాతే నే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి… నేడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు సిద్ధం అయ్యారని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా గత ఎన్నికల్లో చెప్పినవన్నీ అబద్ధాలు అని నిండు శాసనసభలో ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

డిఎస్సీ పై పచ్చి దగా…మోసం..

జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ ప్రకటనపై పచ్చి దగా మోసం చేశారని విమర్శించారు. 26,000 పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని గతంలో చెప్పారు..ప్రస్తుతం కేవలం 6000 పోస్ట్లు విడుదల చేశారు. జగన్ ప్రకటనతో నే నిరుద్యోగ యువత వేలల్లో ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లు ను ఆశ్రయించారు అని పేర్కొన్నారు.నేడు వారి ఆశలపై ఉగ్గీ పోసారని ఆందోళన వ్యక్తం చేశారు.

సీట్ల సర్దుబాటు లో టిడిపి..జనసేన కు స్పష్టత ఉంది.

అతి త్వరలోనే సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుందని…జగన్ వలే ఒక అభ్యర్థికి ఉదయం ఇచ్చిన టికెట్ సాయంత్రం కు మార్చే అలవాటు తమకు లేదన్నారు. వైసిపి లో టికెట్ ఇచ్చినా వారు పోటీ చేసే పరిస్థితి అనుమానంగా ఉందన్నారు. ఈ నెల ఎనిమిదవ తేదీన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారో సారి సమావేశం అయ్యి సీట్లు వెల్లడిస్తారని తెలిపారు.ఇప్పటి వరకు జరిగిన చర్చలు అన్ని సానుకూలంగా జరిగాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *