రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పక్షంలో ఉండగా అక్క చెల్లమ్మలకు తాను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని.. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి మొండిచేయి చూపించారని టిడిపి కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర మహిళాలకు ఆశర పేరుతో జగన్మోహన్ రెడ్డి మహిళలకు టోకరా ఇచ్చారని పేర్కొన్నారు. రాబోయే 26 ఏళ్ల కు కూడా అప్పు తెచ్చి రాష్ట్రంలో తాగుబోతుల సంఖ్య రోజురోజుకూ పెంచుతున్నారన్నారు. తన మనుషుల సొంత డిష్ట్లెరిలో తయారు చేసిన నాణ్యత లేని మద్యాన్ని అమాయకులతో తాగించి మహిళల మాంగల్యాలు తెంచుతున్నరని మండిపడ్డారు.మద్యం తో తన సొంత గళ్లా నింపు కంటున్నారని ఎద్దేవా చేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో అక్క చెల్లమ్మలకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందె విధంగా అసరా కల్పించింది చంద్రబాబు అని గుర్తు చేశారు. మహిళలకు దీపం పథకం కింద 65 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత కూడా టీడీపీ దే అన్నారు. భాలింతలకు, అమృత ఆహరం, తల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్, బాలికలకు ఉచిత సైకిళ్లు, ఉచిత వైద్య పరీక్షలు, ఇలా మహిళల కోసం అనేక పథకాలు పెట్టి మహిళకు ఏ విధంగాను ఇబ్బందులు పడకూడదనె ఉద్దేశంతో ఆనాడు టిడిపి ప్రవేశ పడితే వాటినన్నిటినీ నేడు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.