ఉక్కు నరాలు..ఇనుప కండరాలు కలిగిన యువ సమూహమే జనసేన బలము,బలగం అని జనసేన అధినేత పవన కళ్యాణ్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని “జాతీయ యువజన దినోత్సవం” వేడుకులు మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. “జనసేనానితో గ్లాసు టీ” కార్యక్రమం ద్వారా యువతి,యువకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..దేశం కోసం నిలబడటానికి,సమాజానికి తన వంతుగా మేలు చేయాలి అనే దృక్పథంతో రాజకీయ ప్రయాణం ప్రారంభించానని తెలిపారు.కళ్ళెదుట జరిగే దారుణ విషయాలు మీద తనకు కోపం ఉంటుందని..కానీ సమస్య మూలల మీద వెతికి పూర్తి స్థాయి దృష్టి నిలిపి పరిష్కారం కోసం ఆలోచిస్తాను అని తెలిపారు. సొంత ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక చదివిన చదువులకు ఉద్యోగాలు లేక రాష్ట్ర యువత దూర ప్రాంతాలకు వెళ్లి సాధారణ జీతాలకు పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేనేళ్లు గా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమస్యలను చూశానని,వాటిని పరిష్కరించడానికి కచ్చితంగా అధికారం కావాలని పేర్కొన్నారు. చట్టసభల్లో జనసేన ఉంటుందని,సమస్యలను తీర్చే స్థాయిలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది అని మండిపడ్డారు.గంజాయి మత్తులో నేరాలు పేరిగాయుని విమర్శించారు. నేరాలను అరికట్టాలంటే ముందుగా గంజాయి ముఠాలను కట్టడి చేయాలని తెలిపారు . శ్రీకాకుళం ఉద్ధానం సమస్యను తన వద్దకు తీసుకువచ్చింది ఇద్దరు యువకులే నని గుర్తు చేశారు.అధికారం లోకి వచ్చాక యువతకు ప్రతినిధిగా ఉంటానని వెల్లడించారు.వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకువస్తామని,యువతకు మంచి భవిష్యత్తు ఇస్తామని భరోసా ఇచ్చారు