fbpx

పోలవరంకు గ్రహణం పోవాలంటే… జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవాలి : చంద్రబాబు

Share the content

గత టిడిపి ప్రభుత్వంలో సోమవారంను పోలవరంగా మార్చి 72 శాతం పనులను పూర్తి చేసామని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట లో ఆదివారం రా..కదలిరా బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరైనా అసమర్థుడు వస్తే చేతగాని వారు అంటాము…దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేస్తే ఏమనాలో ఆలోచించండి అని పేర్కొన్నారు. వైసిపి వచ్చిన 2019 లోనే పోలవరంకు గ్రహణం పట్టిందని విమర్శించారు.వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ లను మార్చారని,అధికారులను మార్చి..పోలవరాన్ని గోదావరిలో కలిపారని విరుచుకుపడ్డారు. పోలవరానికి గ్రహణం పోవాలి అంటే జగన్ పోవాలని పిలుపునిచ్చారు. రాబోయే ప్రభుత్వంలో నదులను అనుసంధానం చయడమే కాకుండా.. జిల్లాకు మూడు పంటలుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత టిడిపి,జనసేన తీసుకుంటుంది అని తెలిపారు.
జగన్ పరిపాలనలో ఆక్వా రంగం కుదేలు
గత టిడిపి ప్రభుత్వంలో ఆక్వా రంగానికి పెద్ద పీట వేసాముని వెల్లడించారు.రెండు లక్షల ఎకరాల్లో సాగు పెంచాముని వెల్లడించారు. ప్రస్తుతం ఆక్వా రంగంలో సాగు ఖర్చు మూడు రెట్లు పెరిగిందని విమర్శించారు.మద్దతు ధర లభించడం లేదని, ఫీడ్,మందులు,సేస్,కరెంట్ బిల్ పెంచేసి ఆక్వా రంగాన్ని చంపేశారన్నారు. 1.50 పైసలు కే కరెంట్ ఇస్తామని చెప్పిన జగన్ హామీ ఏమైంది అని ప్రశ్నించారు. రాబోయే ప్రభుత్వంలో రూ .1.50 కే కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు.ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చే భాధ్యత తీసుకుంటామని వెల్లడించారు.వరి రైతుకుధాన్యం కొనుగోలుకు సంబంధించి గోనె సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు.ప్రస్తుతం ప్రాజెక్ట్ లో నీళ్ళు ఉన్నా ప్రభుత్వం క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి కి వచ్చిందన్నారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రైతాంగంలో ఆంధ్రపదేశ్ 1 వ స్థానంలో ఉందని,కౌలు రైతుల ఆత్మహత్య ల్లో రెండో స్థానంలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు.రాబోయే ప్రభుత్వంలో రైతు రాజ్యం తీసుకువస్తామని,రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

  • వైసీపీలో బూతురత్న…బూతు సామ్రాట్
    వైసిపిలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు పాలసీలు పెట్టారని విమర్శించారు.ఎక్కువ బూతులు మాట్లాడే.. బూతురత్న ఐతే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని,బూతు సామ్రాట్ ఐతే మంత్రి పదవి వరిస్తుందని చలొక్తి విసిరారు. డయాఫ్రమ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, పెట్టుబడులు అంటే కోడిగుడ్డు అనే మంత్రి ఐటి మంత్రి,ధాన్యాన్నికి సంచులు ఇవ్వలేని మంత్రి పౌరసరఫరాల మంత్రి, కోర్ట్ ఫైలు లేపేసే వారిని వ్యవయశాఖ మంత్రి అని,గనులను మింగేసీవారు గనుల శాఖ మంత్రి, క్లబ్ లో డాన్స్ వేస్తూ.. మహిళ సంక్షేమం కోసం మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
    ‘రా.. కదలిరా..లో చంద్రబాబు కీలక హామీలు
    ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందని కితాబిచ్చారు. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతగానో ఉపయోగపడిందని వివరించారు. రైతుల బ్రతుకులు మారాలంటే టీడీపీ-జనసేనల ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. మరో మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందన్నారు. మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తా అని యువతను ఉద్ధేశించి అన్నారు.

రాష్ట్రంలోని యువతను ప్రపంచంలో నంబర్‌ వన్‌గా మారుస్తానని చెప్పారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ అనే పేరుతో సూపర్‌ సిక్స్‌ పథకాలను అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని తెలిపారు. ‘అన్నదాత’ పథకం తీసుకొచ్చి రైతులకు ప్రతి ఏటా రూ.20వేలు అందజేస్తామన్నారు. ‘జయహో బీసీ’ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తాం అని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *