టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన “యువగళం నవశకం” సభ అనుకున్న దానికంటే మరింత విజయవంతం అయ్యిందని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టిడిపి,జనసేన కార్యకర్తలకే కాకుండా మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సభ మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించిందని తెలిపారు. ఒకే వేదికపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల కలయకతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని పేర్కొన్నారు.
నవశకం సభకు వచ్చిన అశేష జనవాహిణిని ప్రత్యక్ష ప్రసారల్లో చూసిన వైసిపి నేతలు ఇక సద్దుకోవచ్చనే నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలు అధికార అహంకారంతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, విజనరి నాయకుడు చంద్రబాబుకు మధ్య పోటీ అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తే ఎమౌతుందొ ఊహించిన జగన్ ముందుగానే ఎమ్మెల్యేలను మార్చడం మొదలు పెట్టారని పేర్కొన్నారు. టిడిపి,జనసేన పొత్తు సునామీలో వైసీపీ కొట్టుకుపోడం ఖాయమని వెల్లడించారు.సభను విజయవంతం చేసిన టిడిపి,జనసేన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.