గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడిషనల్ డైరెక్టర్ గా ఐఏఎస్ గీతాంజలి శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ కి చెందిన ఈమె గతంలో కాకినాడలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. తర్వాత తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ గా సేవలు అందించారు. ప్రస్తుతం బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా పనిచేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.