fbpx

కార్మికులు ఆరోగ్యంపై దృష్టి సారించాలి

Share the content

కార్మికులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి ఆనందంగా జీవించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. ది కాకినాడ పోర్ట్ వర్కర్స్ పూల్, ఈఎస్ఐ ఆసుపత్రిల ఆధ్వర్యంలో మంగళవారం నాడు కాకినాడ ఆవరణలోఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాలను కార్మికుల కుటుంబాల సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పరిశీలన చేశారు. అనంతరం కార్మికులు అడిగిన సందేహాలను ఎమ్మెల్యే నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్ర రెడ్డి, కోకనాడ ఛాంబర్ అధ్యక్షుడు వివి రాఘవులు, పోర్ట్ వర్కర్స్ పూల్ అధ్యక్షుడు ఏవి చలం, కార్యదర్శి పివి రావు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ, స్టీవ్డోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదం మహేష్, డీప్ వాటర్ పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు పట్టా ధనలక్ష్మి, కార్యదర్శి బలసాడి వీరబాబు, వినాయక డీప్ వాటర్ పోర్ట్ యూనియన్ ఇంచార్జ్ పినపోతు రాజు, టవ్వింగ్ బోట్స్ యూనియన్ అధ్యక్షులు ప్రెసింగి శ్రీను, కార్యదర్శి ఆకుల దుర్గారావు, ఈఎస్ఐ వైద్యులు ఎంఎం హుస్సేన్, ఎవి రామారావు, ఎన్ మురళీకృష్ణ, ఎం జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *