fbpx

టిడిపి విజయం ఖాయం

Share the content

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయం అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు సత్యనందరావు అన్నారు. రావులపాలెం ముమ్మిడివరప్పాడు గ్రామంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ, రచ్చబండ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యానందరావు మాట్లాడుతూ కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతాలు చూడం అని గొప్ప మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని దోచుకోవడం తప్ప అభివృద్హి చేసిందేమిలేదని తెలిపారు.గ్రామాల్లో మౌలిక సదుపాయం కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని తెలిపారు. జాతీయ రహదారికి చేరువలో ఉన్న ముమ్మడివరప్పాడు గ్రామం అభివృద్హికి మాత్రం ఆమడ దూరంలో ఉందని తెలిపారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా మారిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. గ్రామంలో మౌలిక వసతులు సైతం సమకూర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, తెలుగు యువత జిల్లా ఆధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభి రామారావు, కాపా లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *