ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసులు లేకుండా రాజకీయం చేసుకుంటూ వస్తున్న జనసేన అని పవన్ కళ్యాణ్ మీద ఎలాగైనా బురదజల్లేందుకు లేదా ఆయనను ఏదైనా కేసులో ఇరికించేందుకు వైసిపి పెద్ద స్కెచ్ వేసినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా వారాహి విజయ యాత్ర కార్యక్రమాల్లో అలజడులు సృష్టించడం, ఆ నెపాన్ని జనసేన కార్యకర్తల మీద నాయకులు మీద వేయడానికి వైసిపి పన్నాగం పన్నుతున్నట్లు అర్థం అవుతుంది. వారాహి విజయ యాత్ర నాలుగో విడత ప్రారంభానికి పవన్ కళ్యాణ్ అవనిగడ్డ సభను ఏడు గంటలకి మొదలు పెట్టాల్సి ఉండగా దానికి విభిన్నంగా పవన్ కళ్యాణ్ ముందుగానే అవనిగడ్డ కు వచ్చారు. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఒక్కరే కారులో ఎవరికి చెప్పకుండా అవనిగడ్డకు చేరుకోవడం విశేషం. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వారాహి విజయ యాత్ర రోడ్ షోలో కానీ బహిరంగ సభల వద్ద గాని ఏదైనా అలజడులు సృష్టించి పూర్తిగా దానిని జనసేన మీద తోసేసి పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఇరికించాలి అని వైసిపి పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడే సమయంలో ఏదైనా పరుష పదజాలం వాడి జగన్ ను ఇష్టానుసారం మాట్లాడితే కనుక వెంటనే వైసీపీ కార్యకర్తలు అక్కడే రెచ్చిపోయి గందరగోళం సృష్టించడానికి కూడా సిద్ధం అయినట్లు సమాచారం. అవనిగడ్డ సభలో ఈ పక్కా ప్లాన్ వైసిపి అమలు చేయాలని చూడడంతోనే పవన్ కళ్యాణ్ ముందుగా సభ ప్రాంగణానికి వచ్చారు. దీంతోపాటు ఎక్కడ ముఖ్యమంత్రిని పరుష పదజాలం వాడకుండా… విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. దీంతోనే సభ విజయవంతంగా పూర్తయింది. లేకుంటే కనుక వైసిపి పెద్దల ఆదేశాల మేరకు పెద్ద గొడవ అవనిగడ్డలో చేసేందుకు వైసిపి అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అయితే మరో ఐదు రోజులు పాటు సాగనున్న వారాహి విజయ యాత్రలో వైసిపి ఏ సమయంలో అయినా దాడి చేసి క్రిమినల్ కేసుల వరకు పవన్ ను తీసుకు వెళ్ళవచ్చు అన్న ఇంటిలిజెంట్ సమాచారం పక్కాగా ఉంది.