fbpx

4వ విడత వారాహి యాత్ర అత్యంత కీలకం.

Share the content

జనసేన పార్టీ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర నాలుగో విడత అత్యంత కీలకం కానుంది పొత్తుల ప్రకటన తర్వాత చేస్తున్న యాత్ర అత్యంత కీలకం కానుంది. నాలుగో విడత యాత్రలో జనసేనాని నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా కీలకం కానుంది. శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంలో అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసి సమన్వయం చేసేందుకు జనసేన అధినేత ఇచ్చే కీలకమైన సూచనలు జన సైనికులకు వీర మహిళలకు దిశా నిర్దేశాలు చేస్తాయి. జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నేతలతో కార్యకర్తలతో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేయనున్నారు.

మొదటినుండి బిజెపితో జనసేన పొత్తులో ఉందని అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు. అయితే కేంద్రం నుండి పొత్తులపై ఎటువంటి క్లారిటీ వచ్చింది అనేది మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది. అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తుల విషయంలో నియోజకవర్గ స్థాయి నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఈ విషయంలో మాత్రం జనసేన నుండి సీటు ఆశిస్తున్న శ్రేనుల గుండెల్లో గుబులు మొదలైంది. వారాహి విజయ యాత్ర ద్వారా తమ నియోజకవర్గానికి వస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ సీట్లు సర్దుబాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే విషయంపై ఆందోళన చెందతున్నారు. తాము ఎక్కడ సీటు వదులుకోవాల్సి వస్తుందో అనే ఆందోళన జనసేన నాయకులలో స్పష్టంగా కనిపిస్తోంది. సీట్లు సర్దుబాటు విషయంలో జనసేనని జనసేన నేతలను బుజ్జగిస్తూ ముందుకు వెళ్తారా లేదా తన నిర్ణయానికి కట్టుబడిన వాళ్లే తనతో రావాలని తెగేసి చెప్తారో వేచి చూడాలి.అలాగే బిజెపి తో కొత్త విషయం పైన కూడా పూర్తి క్లారిటీ రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *