రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెన్ను దుమారాన్ని రేపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకులు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చెలా ఆయన చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎటు వెళ్తాయి అన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది. సినిమాలు పై పిచ్చుక పై బ్రహ్మాస్త్రం వేస్తారు ఏంటి అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెద్దవే అని చెప్పాలి. ఇటీవల సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు అందరూ పవన్ కళ్యాణ్ సినిమాలు పై మాట్లాడుతున్న తరుణంలో తమ్ముడికి బాసటగా చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారా అన్న సందేహం ఇప్పుడు కలుగుతుంది.
రాజకీయాల్లోకి వస్తారా
ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు పాత పరిచయంతో చిరంజీవిని కలిసినప్పటికీ రాజకీయాల గురించి పెద్దగా చర్చించింది లేదు. కాంగ్రెస్ పార్టీ లోనే ఇంకా చిరంజీవి ఉన్నాడని ఆ పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ చిరంజీవి మాత్రం కాంగ్రెస్ వైపు మళ్లీ చూడలేదు. కేవలం సినిమాలు చేసుకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఓడిపోవడం వరుసగా జరిగింది. ఈ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏ మాత్రం భయపడకుండా పార్టీ నడుపుతున్న తీరు, ఆయనపై వైసీపీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న మాటల దాడి తీవ్రం అవుతున్న తరుణంలో ఆయనకు బాసటగా చిరంజీవి రంగంలోకి దిగుతారు అన్న ఊహాగనాలు ఇప్పుడు మళ్ళీ పెరిగాయి. అయితే చిరంజీవి మళ్ళీ రాజకీయాలకు వస్తే ప్రజలు ఆయనని ఎలా రిసీవ్ చేసుకుంటారు.. గతంలో పార్టీని విలీనం చేసిన చిరంజీవి మళ్ళీ ప్రజల మధ్య తిరిగితే జనసేన పార్టీకి లాభమా నష్టమా అనేది జాగ్రత్తగా బేరిజు వేసుకొని చిరంజీవిని మళ్ళీ మెల్లగా రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు తన తమ్ముడికి బాసటగా చిరంజీవి కూడా రాజకీయాల రణ క్షేత్రంలో మద్దతుగా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.