తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ ఇక పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పింది.
పోలవరం ప్రాజెక్టుకు 1249 కోట్లు మాత్రమేఇవ్వాల్సి ఉందని తెలియజేసింది. ప్రస్తుతం 824 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం రాష్ట్రానికి లేఖలో తెలియజేసింది …
లియజేసింది. కొత్త డి పి ఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలని పదేపదే కేంద్రాన్ని కొరడానికే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారని చేస్తున్న ప్రచార ఫలితం గత వారం రోజులగా జరుగుతున్న పరిణామాలే తెలియజేస్తున్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక సంఘం కింద తాజాగా ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ 17 కోట్లు విడుదల చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ ఏపీ ప్రభుత్వానికి తెలియచేసింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2020 నవంబర్ 2 నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను 2013 14 ధరల ప్రకారం 20398.61 కోట్లకు ఆమోదించడం జరిగింది. దీని ప్రకారమే 2014 ముందుగా 4730.71 కోట్లు నీటిపారుదల విభాగం కింద ఖర్చు చేశామని మిగిలిన నిధులు ఇస్తామని తెలియజేశారు. ఈ ప్రకారమే ఇప్పటివరకు ప్రాజెక్టుకు 13,592.22 కోట్లు ఇచ్చామని మిగిలిన నిధులు 2075.61 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలియజేసింది. ప్రస్తుతం 828 16 కోట్ల నిధులు విడుదల చేశామని ఇంకా మిగిలింది ఒక వెయ్యి 249 కోట్లు మాత్రమే పోలవరం ఇవ్వాల్సి ఉన్నట్లు కేంద్రం లిఖిత పూర్వంగా స్పష్టం చేసింది .