దొమ్మేరు ఘటనకు సంబంధించి 24 గంటల్లో నింధితుల్ని అరెస్ట్ చేయకపోతే డిజిపి కార్యాలయం ముట్టడిస్తామని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అదేక్షుడు పాలేటి మహేశ్వరావు హెచ్చరించారు. సొంత నియోజకవర్గంలోనే దళిత యువకుడి ఆత్మహత్యకు బాధ్యత వహించి హోమ్ మంత్రి తేనేటి వనిత తన పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు. దొమ్మేరులో మృతుడి కుటుంబ సభ్యులను ఆదివారం బృంద సభ్యలతో కలిసి పరామర్శించారు.రాష్ట్రంలో దళితులు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారనేఎందుకు ఈ సంఘటన అద్దం పడుతుందన్నారు. వెంటనే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. పిల్లి సురేంద్ర, కె శ్యామకుమార్ తదితరులు అయన వెంట ఉన్నారు.