ఏలూరు మండలం కొక్కిరాయిలంక గ్రామానికి చెందిన ఉచ్చల భాస్కర్ అనుమానస్పద మృతిపై తండ్రి మహాంకాళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ ఎం. విక్టర్ విచ్చేసారు. దళిత కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు స్వీకరించారు. తదుపరి ఎస్సీ కమీషన్ చైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ మార్చి 6వ తేదీన ఏలూరు మండలం కొక్కిరాయిలంక గ్రామానికి చెందిన ఉచ్చల భాస్కర్ ప్రమాదవశాత్తు మరణించాడని ఈ మృతి అనుమానస్పద మృతిగా భావించి మృతుడు తండ్రి మహాంకాళి ఎస్సీ కమీషన్ కు ఇచ్చిన ఫిర్యాదుమేరకు విచారణ కోసం కొక్కిరాయిలంక రావడం జరిగిందని,పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
అనంతరం కొక్కిరాయిలంక గ్రామానికి ఎస్సీ కమీషన్ చైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్ అధికారులతో కలిసి వెళ్ళారు.
#godavaripoliticsnews#telugutrendingnews#TeluguBreakingNews#Crime#SCcommission#godavaripoliticsnews#godavarionlionenews#BreakingNews